Thursday, April 25, 2024

గొల్లూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపనలు

మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం “పల్లె ప్రగతి” కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అమీర్ పేట్ నుండి పెంజర్ల వయా మాణిక్యమ్మ గూడ వరకు 11 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. వాటితో పాటు క్రీడా ప్రాంగణంను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement