Sunday, April 28, 2024

ఐటీ రైడ్స్ తర్వాత.. సోను సూద్ రియాక్షన్ ఇదే..

సోనుసూద్ నివాసలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోను ఛారీటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు అధికారులు. దాడులు పూర్తయిన తర్వాత రూ. 20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు. ఈ దాడులు జరిగిన తర్వాత సోను తొలిసారి స్పందించారు. “ప్రతిసారి నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను సమయం చెపుతుంది. దేశ ప్రజలకు నా శక్తి మేరకు సేవ చేయాలని మనస్పూర్తిగా నిర్ణయించుకున్నా. నా ఫౌండేషన్ లో ఉన్న ప్రతి రూపాయి కూడా ఒక విలువైన జీవితాన్ని కాపాడటం కోసం, అవసరమైన వారిని ఆదుకోవడం కోసం ఎదురు చూస్తోంది. వివిధ ఎండార్స్ మెంట్లలో తనకు వచ్చే డబ్బును సామాజికి సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని తన బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తుంటా. ఇప్పటికీ అది జరుగుతోంది. గత నాలుగు రోజులుగా నా అతిథుల (ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నా. అందువల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు మళ్లీ తిరిగివచ్చాను, నా ప్రయాణం కొనసాగుతుంది” అంటూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఆర్ఎంపీ డాక్టర్‌కు లైంగిక వేధింపులు.. ఒక్క ముద్దిస్తే రూ.25వేలు ఇస్తానన్న వ్యక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement