Sunday, May 5, 2024

ముదిరిన వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో కొంతమంది తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అలాంటి వారిపై చట్టపరంగా ముందుకెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు చెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ లో ఎక్కడా కూడా నేరుగా రేవంత్ రెడ్డి పేరును పేర్కొనకపోవడం గమనార్హం. ఈ ట్వీట్ కు రేవంత్ ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి. కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement