Monday, April 29, 2024

Sonia Letter To PM: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఈనెల 18వతేదీ నుంచి 22వతేదీ వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆమె కోరారు.

తొమ్మిది అంశాలపై చర్చకు సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, అధిక ధరలపై చర్చ జరగాలన్నారు. రైతు సమస్యలు, కనీస మద్దతు ధర, మణిపూర్ అంశాలపై హర్యానాలో అల్లర్లపై, ప్రకృతి విపత్తుల అంశాలపై చర్చించాలని లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement