స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు తెలిపాయి. స్టార్ట్ ఫోనుల్లో యాప్ థ్రాట్లింగ్ జరగటంపై ఇరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్లలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం ఈ సంస్థలు ప్లేస్టోర్స్ లో ఆయా యాప్ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్ను పెంచడంతోపాటు గేమ్లకు అనువుగా సాఫ్ట్ వేర్ను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎన్22తోపాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్లో యాప్లు నెమ్మదిగా స్పందిస్తున్నాయి. యాప్ల పనితీరు మందగించడంతో శాంసంగ్, వన్ప్లస్ సంస్థల యాజమాన్యాల స్పందించాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్22సిరీస్లో గేమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్ వేర్ ఇన్బిల్ట్గా వస్తోంది.
దీంతో వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ క్రోమ్, నెట్ఫ్లిక్స్, జూమ్ తదితర యాప్లను శాంసంగ్ కంపెనీ యాప్ థ్రాట్లింగ్ జాబితాలో చేర్చింది. యాప్ల పనితీరు మెరుగుపర్చేందుకు త్వరలో కొత్త సాప్ట్ వేర్ అప్డేట్ చేయనున్నామని, గేమ్ లాంచర్ యాప్లో గేమ్ బూస్టర్ ల్యాబ్ అనే ఆప్షన్ను తీసుకువస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది. వన్ప్లస్9, వన్ప్లస్9 ప్రో ఫోన్లులో ఇదే సమస్య యూజర్లను వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆక్సిజన్ ఓఎస్ 12ఓ ఆప్టిమైజ్డ్ మోడ్ను తీసుకువస్తున్నామని వన్ప్లస్ కంపెనీ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..