Wednesday, May 1, 2024

తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు..

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (సాలకట్ల) గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి, భూదేవీ సమేతంగా మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు.

మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్‌ స్వామి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement