Thursday, May 2, 2024

ఎంసెట్ 1060 దరఖాస్తులు

టీఎస్ ఎంసెట్- 2021 ప్రవేశాలకు ఈ నెల 22 వరకు మొత్తం 1060 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సుకు 316, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు సంబంధించి 744 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు మే 18 చివరితేదీగా నిర్ణయించారు.రూ.5 వేల ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 20వ తేదీ నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిసున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement