Tuesday, May 7, 2024

పాఠశాలల వేళల్లో స్వల్ప మార్పులు.. విద్యాశాఖ ఆదేశాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాఠశాలల వేళల్లో విద్యాశాఖ మరోసారి స్వల్ప మార్పులు చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆయా జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలు గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నడిపించాలని సూచించారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఎండల తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉండడంతో పాఠశాలల సమయాన్ని గంట వరకు కుదించి ఈనెల 6వ తేదీ వరకు 11.30 గంటల వరకే తరగతులను నిర్వహించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లిప్పుడు ఆ సమయాన్ని పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement