Monday, April 29, 2024

Canada Open | కెనడా ఓపెన్ క్వార్టర్స్‌లోకి సింధు, లక్ష్యసేన్‌

కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మెన్స్‌ డబుల్స్‌లో క్రిష్ణప్రసాద్‌ గరగ, విష్ణువర్ధన్‌ గౌడ్‌ పంజల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌ విభాగం ప్రిక్వార్టర్స్‌లో సింధు, నత్సుకి నిదైర(జపాన్‌) తలపడాల్సి ఉండగా, నత్సుకి వైదొలగడంతో సింధు నేరుగా క్వార్టర్స్‌కి చేరుకుంది. లక్ష్యసేన తన ప్రత్యర్థి వైగర్‌ (బ్రెజిల్‌)తో పడగా, 21-15, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు.

లక్ష్యసేన ఆట ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచి, ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ వచ్చాడు. కేవలం 31 నిముషాల్లోనే ఆట ముగిసింది. క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. క్రిష్ణ ప్రసాద్‌- విష్ణువర్దన్‌ జోడి ప్రత్యర్థి ఇండోనేసియా జంట మొహమ్మద్‌ అహ్సన్‌, హెండ్ర సెటియావాన్‌పై చేతిలో 9-21, 11-21 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement