Saturday, April 27, 2024

ఫలితాలు విడుదలైన కాసేపటికే.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఆర్మూర్ టౌన్, మే 9 (ప్రభ న్యూస్) : ఆర్మూర్ పట్టణంలో ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఫెయిల్ అయినానని తెలిసి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి మోర ప్రజ్వల్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం మాదాపూర్ నారాయణ కాలేజీలో బైపిసి చదివాడు. మంగళవారం రోజున ఇంటర్ ఫలితాలు రావడంతో ఒంటరిగా ఉన్న ప్రజ్వల్ రిజల్ట్ చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కుమారుడికి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న నర్సును చూసి రమ్మని అనడంతో అక్కడ అన్నయ్య లేడని సమాధానం చెప్పింది. దాంతో ఆయన తల్లి, తండ్రి పైకి వెళ్లి చూడడంతో బెడ్ రూమ్ లో ఉరివేసుకొని ప్రజ్వల్ కనబడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా మరణించాడని తెలిసింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు నెలకొన్నాయి. చుట్టుపక్కల ప్రజలు, అతని స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement