Sunday, April 28, 2024

ఆర్టీసీ బస్సుకు విద్యుత్ షాక్.. మహిళ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగలడంతో షాట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఆ సమయంలో బస్సులో 23మంది ప్రయాణికులున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఈ విషయంలో లేడీస్ ఫస్ట్ కాదండోయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement