సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.
ఇక శివరాత్రి సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి రేపు ఉదయం 11.07 గంటలకు ఓ పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కళావతి పాట కూడా మిలియన్ వ్యూస్ తో రికార్డ్ లు బద్దలుకొడుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..