Sunday, May 5, 2024

Shiv Sena:శివసేన ఎమ్మెల్యే మృతి… ద్రిగ్భాంతి వ్య‌క్తం చేసిన ఏక్‌నాథ్‌షిండే

మహారాష్ట్రలో సీనియర్‌ రాజకీయనాయకుడు, శివసేన ఎమ్మెల్యే అనిల్‌ బాబర్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సీఎం ఏక్‌నాథ్‌ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గత కొద్దిరోజులు అనిల్‌ బాబర్‌ అనారోగ్యం కారణంగా సంగ్లీ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఇక, అనిల్‌ మృతిపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షిండే.. బాబర్ మృతితో ఒక మార్గదర్శిని, సన్నిహితుడిని కోల్పోయినట్టు కామెంట్స్‌ చేశారు. మహారాష్ట్ర ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కోల్పోయిందన్నారు. అలాగే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని షిండే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement