Thursday, April 25, 2024

ఐపీఎల్‌లో టాప్-2కి దూసుకెళ్లిన ధావన్

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఘనత సాధించాడు. 5,507 పరుగులతో లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా ధావన్‌ నిలిచాడు. అహ్మదాబాద్‌లో గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్‌ 46 పరుగులు పూర్తి చేయడం ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా(5,489)ను తాజాగా ధావన్‌ అధిగమించాడు. ఐపీఎల్‌ 2021లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల(311)తో గబ్బర్‌ ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. కాగా ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ 6వేల పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement