Saturday, April 20, 2024

ప్రభుత్వాలకు సోనుసూద్ సూచన

గతేడాది కరోనా సమయంలో ఎంతో మంది పేద వారికి సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనుసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తానున్నానని భరోసా కల్పించి అండగా నిలిచాడు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారికి స్వగ్రామాలకు తరలించాడు .అయితే ఇప్పుడు కరోనా సెకండ్ ప్రారంభమైంది. ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉండట్లేదు. అది దొరక్క ఎంతో మంది చనిపోతున్నారు.

అయితే ఇదే విషయంపై సోను సూద్ స్పందిస్తు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ఎవరైనా ప్రాణాలు విడిస్తే వారి పిల్లలకు ప్రభుత్వాలు ఉచితంగా చదువు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సోనుసూద్.

https://www.instagram.com/tv/COPWWnGgbqs/?igshid=iutkde05z6ez

Advertisement

తాజా వార్తలు

Advertisement