Wednesday, April 24, 2024

మిగిలింది బాలయ్య ఒక్కడే !!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం అఖండ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ రికార్డు స్థాయిలో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నారప్ప సినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ప్రస్తుతానికి బాలయ్య ఒక్కడే మిగిలి ఉన్నాడు. అయితే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసిన అఖండ యూనిట్ అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేక కరోనా పరిస్థితులు సద్దుమనిగే వరకు వేచి చూస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement