Saturday, May 18, 2024

జపనీస్‌ ఎన్‌సెఫలిటీస్‌తో ఏడుగురు మృతి..

గౌహతి: అస్సాంలో గత ఎనిమిది రోజుల్లో జపనీస్‌ ఎన్‌సెఫలిటీస్‌ (జేఈ)తో ఏడుగురు మరణించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాలను ఆదేశించింది.

జులై ఒకటో తేది నుండి రాష్ట్రంలో మొత్తం 74 జపనీస్‌ ఎన్‌సెఫలిటీస్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం అస్సాం జాతీయ ఆరోగ్య మిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. తగిన వైద్య ప్రక్రియ ద్వారా కేసులను గుర్తించి ధృవీకరించాలని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement