Thursday, May 2, 2024

తక్కువ ఛార్జీతో 17 ప్రాంతాలకు సర్వీస్‌లు.. బుకింగ్స్‌ ప్రారంభించిన స్కూట్‌ ఎయిరలైన్స్‌

తక్కువ ధరల విమానయాన సంస్థ స్కూట్స్‌ మన దేశంలోని వివిధ పట్టణాల నుంచి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 గమ్యస్థానాలకు డిస్కౌంట్‌ రేట్స్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. ఈ నెల 16 నుంచి 20 వ తేదీ మధ్యలో టికెట్స్‌ను బుక్‌ చేసుకోవచ్చని స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. మన దేశంలోని అమృత్‌సర్‌, కోయంబత్తూర్‌, తిరువునంత పురం, తిరుచిరాపల్లి, విశాఖపట్నం నుంచి ఈ సర్వీస్‌లు నడుస్తాయి.

ఇప్పుడు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు 2023 ఆగస్టు 31 వరకు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆయా దేశాల్లోని 17 ప్రాంతాలకు ఛార్జీలు 6,200 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, పిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, వియత్నాంతో పాటు స్కూట్‌ నెట్‌వర్క్‌లోని వివిధ గమ్యస్థానాలకు ప్రయాణికులు తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. సింగపూర్‌ ద్వారా వెళ్లే ఇతర దేశాల ప్రాంతాలకు కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement