Friday, May 17, 2024

గెస్ట్‌ ఫ్యాకల్టిల సర్వీసు రెన్యూవల్‌.. 1654 మంది ఉద్యోగులను రెన్యూవల్‌ నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టిల సేవలను ప్రభుత్వం రెన్యూవల్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1654 మంది గెస్ట్‌ ఫ్యాకల్టిdలను రెన్యూవల్‌ చేయాలనే డిమాండ్‌ గత కొద్దిరోజులుగా ఉండడంతే వీరిని 2022-23 విద్యాసంవత్సరానికి రెన్యూవల్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాత్కాలిక ప్రాతిపదికన వీరి సేవలను వినియోగించుకోవాలని ఇంటర్‌ బోర్డు అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాయకులు రామకృష్ణ గౌడ్‌ హర్హం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement