Sunday, May 19, 2024

సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌.. మైలార్‌ దేవులపల్లి పరిధిలో ఒకే రాత్రి ఇద్దరిని హత మార్చిన వైనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలకు పాల్పడి పోలీసులను, హైదరాబాద్‌ వాసులను నిద్రపోనివ్వకుండా చేసిన సైకో కిల్లర్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వరుస హత్యలకు చేసి నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి సీరియల్‌ కిల్లర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇంకా ఇలా ఎవరినైనా హతమార్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మెయిన్‌ రోడ్డపై జరిగిన జంట హత్యలు స్టానికంగా కలకలం సృష్టించాయి మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలో రెండు హత్యలు జరగడంతో స్థానికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు.

రోడ్డు పక్కన దుప్పట్లు అమ్ముకునే వ్యక్తిని, షాప్‌ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని హంతకుడు గ్రానైట్‌ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సీరియల్‌ కిల్లర్‌ హైదరాబాద్‌లోని నేతాజీనగర్‌, దుర్గానగర్‌ చౌరస్తా, కాటేదాన్‌ ప్రాంతాల్లో తిరుగుతూ.. వరుస హత్యలకు పాల్పడినట్లు పోలీసులు జరిపిన విచారణలో బయట పడింది. రోడ్డు పక్కన పడుకుంటున్నవారే లక్ష్యంగా హతమారుస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఇద్దరిని హత్య చేసిన నిందితుడు.. ఈ నెల 7వ తేదీన రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని దారుణంగా హతమార్చినట్లు విచారణలో తేలింది. గంజాయికు బానిసైన వారు ఈ తరహా హత్యలు చేస్తారని.. నిందితుడి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement