Tuesday, May 7, 2024

అవతార్ మూవీకి సీక్వెల్.. తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు రూ.120 కోట్లు..!

అవతార్ మూవీకి సీక్వెల్ రానుంది. ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాను డిసెంబర్ 16 .. 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు ట్రేడ్ టాక్. తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు రూ.120 కోట్లు వరకు రేటు పలుకుతున్నట్లు సమాచారం. దాంతో ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ఉంటాయని, ముప్పై నుంచి నలభై కోట్ల దాకా రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో వంద కోట్లుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించారు. సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ పండోరాలో నివాసం ఏర్పరచుకున్నాకా మానవజాతితో ఎలా పోరాడారు? పండోరా జాతిని ఎలా రక్షించారు అన్నది ఈ సీక్వెల్‌లో చూపించనున్నారు. క్రిస్‌మస్‌ కానుకగా భారత్​లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్​ కానున్నట్లు తెలిపింది. అలాగే ఈ చిత్రానికి టైటిల్​ కూడా ‘అవతార్​: ది వే ఆఫ్​ వాటర్’​ అని పేరు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement