Saturday, April 27, 2024

Telangana | సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స్వ‌రూపకు ఘనంగా స‌త్కారం.. మ‌హిళా దినోత్స‌వాన పుర‌స్కారం

తెలంగాణ ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప‌లువురు మ‌హిళ‌ల‌కు పుర‌స్కారాలు అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా ఇవ్వాల (బుధ‌వారం) వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘ‌నంగా స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జర్నలిజం నుంచి తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా “విశిష్ట మహిళా పురస్కారం” అందుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ స్వరూప పొట్లపల్లి. అవార్డులకు ఎంపికైన మహిళలతో కార్యక్రమానికి ముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement