Thursday, April 25, 2024

Telangana | బీఆర్​ఎస్​ పార్టీకి షాక్‌.. వ‌న‌ప‌ర్తి జెడ్పీ చైర్మన్, ఎంపీపీల మూకుమ్మ‌డి రాజీనామా

ఉమ్మడి మహబూబ్​నగర్​ బ్యూరో (ప్రభ న్యూస్) : వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి MPP కిచ్చారెడ్డి.. పెద్దమందడి MPP మెగా రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, MPTC లు, మాజీ MPP, మాజీ ZPTCలు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు, సర్పంచులు.. ఇతర ముఖ్య నాయకులు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డి ఇవ్వాల తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ వంతు కృషి చేశామన్నారు.

రాష్ట్రం ఏర్పాటు కాక ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వెనుకబడిన వనపర్తి జిల్లాలోని రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఇబ్బందులను భరిస్తూ రాత్రింబవళ్లు పార్టీ ప్రతిష్టత కు బలోపేతానికి అహర్నిశలు శ్రమించా మన్నారు.. తాము చేసిన పనుల వల్ల వనపర్తి నియోజకవర్గంలోని నాయకులకు గుర్తింపు వచ్చింది.. కానీ అహర్నిశలు శ్రమించిన తాము మాత్రం గుర్తింపునకు నోచుకోలేకపోయామనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా భరించామని.. ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టి అగౌరవపడుతూ ముందుకు సాగలేకపోతున్న తరుణంలో ప్రస్తుతానికి పార్టీ సాధారణ క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 9న రాజీనామాలు కేసీఆర్ కు పంపిస్తామని ప్రకటించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement