Saturday, May 4, 2024

ఈటల, అర్వింద్ కు కేంద్ర బలగాల భద్రత

ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్ లకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఇద్దరు నేతలుcrpf భద్రత పరిధిలోకి వెళ్లనున్నారు. ఈట‌లకు వై ప్లస్, అర్వింద్ కు వై సెక్యూరిటీ, ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించనున్నారు. భద్రత అడిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఈటల అన్నారు.

కాసేపట్లో ఇద్దరు నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ఈటల, ధర్మపురి అర్వింద్ కు కేంద్ర సర్కార్ భద్రత పెంచనుంది. దీనితో ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement