Sunday, May 5, 2024

Breaking: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

పదిహేను రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 15వ తేదీగా నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్ ల పదవీకాలం ముగియనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేంరెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement