Friday, May 3, 2024

NZB: నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా ప్రారంభించారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపేందుకు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వంలో నియోజకవర్గం ఎంతో వెనుకబాటుకు గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాలను పేదల ధరిన చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యారాణి, నాయకులు పండరి, అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement