Wednesday, May 1, 2024

ఎస్‌బీఐ జూనియ‌ర్ అసోసియేట్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష వాయిదా

క‌రోనా ప్ర‌భావంతో ప‌రీక్ష‌ల వాయిదా ప‌రంప‌ర‌ కొన‌సాగుతోంది. తాజాగా ఎస్‌బీఐ జూనియ‌ర్ అసోసియేట్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష వాయిదా ప‌డింది. దేశంలో ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను వాయిదా చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ప‌రీక్షను ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్ష జూన్‌లో జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కాగా ఆగ‌స్టులో జ‌ర‌గ‌నున్న మెయిన్స్ ప‌రీక్ష గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. అయితే దానికి కూడా వాయిదా వేసే అవ‌కాశముంది.

దేశవ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 5237 జూనియ‌ర్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఏప్రిల్‌ నెల‌లో విడుద‌ల చేసింది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను వాయిదా వేసింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన వివ‌రాల కోసం అభ్య‌ర్థులు త‌ర‌చుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాల‌ని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement