Wednesday, May 8, 2024

శశికళకు ఊరట.. జైలులో స్పెషల్​ ట్రీట్​మెంట్​ కేసులో బెయిలు మంజూరు

జైలులో ఉన్నప్పుడు వీకే శశికళ, ఆమె కోడలు ఇళవరసికి ప్రత్యేక గౌరవం ఇచ్చారన్న విషయంపై నమోదైన కేసులో బెంగళూరులోని అవినీతి నిరోధక శాఖ (ACB) కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో వీకే శశికళ ఉన్నారు. అప్పడు ఆమెకు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి గాను జైలు అధికారులకు, శశికళకు మధ్య రూ.2 కోట్ల మార్పిడి జరిగిందని మాజీ డీఐజీ (జైళ్లు) డి. రూప కూడా ఆరోపించారు.

ఈ విషయంలో 2018లో కర్నాటక ప్రభుత్వం శశికళకు ఇస్తున్న ప్రత్యేక హోదాపై విచారణకు ఆదేశించింది. స్పెషల్​ ట్రీట్​మెంట్​ కేసులో బెంగళూరు సెంట్రల్ జైలు సీనియర్ అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలన్న ఆదేశాలున్నాయి. కాగా, ఈ కేసులో వీకే శశికళ, ఆమె కోడలు ఇళవరసికి ఇవ్వాల (శుక్రవారం) ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement