Thursday, May 2, 2024

వంద రోజులు పూర్తి చేసుకున్న స‌ర్కారు వారి పాట‌- స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు – కీర్తి సురేశ్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారువారి పాట‌ .. వీరి లవ్ ట్రాక్ కి మంచి మార్కులు పడిపోయాయి. సముద్రఖని విలనిజం హైలైట్ గా నిలిచింది. తమన్ సంగీతం ఈ సినిమాను నిలబెట్టింది. ఆయన పాటల్లో ‘మ మ మహేశా’ మాస్ ఆడియన్స్ లోకి ఒక రేంజ్ లో దూసుకుని వెళ్లింది. మొత్తం మీద ఈ సినిమాతో పరశురామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా ఈ చిత్రం వంద‌రోజులు పూర్తి చేసుకుంది. మైత్రీ – 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా, మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో .. విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకి 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement