Wednesday, May 15, 2024

ఫొటోగ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివి : బండి సంజయ్

జనగామ : సమాజంలో ఫొటోగ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొనియాడారు. శుక్రవారం అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చీటకోడూరు పాదయాత్ర శిబిరం వద్ద పలువురు ఫొటో గ్రాఫర్లను ఆయన శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో వారి సేవలను మాటల్లో వర్ణించలేనివన్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవడం లోనూ… ఫొటో గ్రాఫర్లు తీసిన ఫొటో తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఫొటోగ్రాఫర్లకు, కెమెరామెన్ లకు అక్రిడిటేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. ఫొటో గ్రాఫర్ల కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఫొటో గ్రాఫర్ లను బండి సంజయ్ క్లిక్ అనిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement