Tuesday, April 23, 2024

ఎంతో మంది వీరుల త్యాగ ఫలిత‌మే స్వేచ్ఛాయుత భారతావని : మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్

ఎంతో మంది వీరుల త్యాగాల ఫ‌లితంగా స్వేచ్ఛాయుత భార‌తావ‌ని ఏర్ప‌డింద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం క‌నీవిని ఎరుగ‌ని రీతిలో దేశ గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్‌పేటలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement