Thursday, May 16, 2024

శాంసంగ్‌ ఇండియాలో గెలాక్సీ ఏ73 5జీ ఆవిష్కరణ..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : ఇండియా అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన శాంసంగ్‌, గెలాక్సీ ఏ73 5జీ ని ఆవిష్కరించింది. ఫ్లాగ్‌షిప్‌ – వంటి గెలాక్సీ ఏ73 5జీ, 120హెచ్‌ జడ్‌ రీఫ్రెష్‌ రేటు, 108ఎంపి ఓఐఎస్‌ (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) కెమెరా, ఐపి67 రేటింగుతో సూపర్‌ ఎమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే తో సహా ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. 8జీబీ ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ కోసం రు. 41,999లు, 8జీబీ ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ కోసం రూ. 44,999 తో గెలాక్సీ ఏ73 5జీ ధర నిర్ణయించబడింది.

గెలాక్సీ ఏ73 5జీ ని ముందస్తుగా రిజర్వు చేసుకునే వినియోగదారులు రూ.6999 ల విలువైన గెలాక్సీ బడ్స్‌ లైవ్‌ను కేవలం రు.499 కే పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఒక ప్రత్యేక ప్రవేశ ఆఫరుగా, వినియోగదారులు శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డులు లేదా ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.3వేల వరకూ తక్షణ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement