Friday, May 10, 2024

రియల్‌ మి 9తో పాటు జీటీ 2 ప్రో విడుదల

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ బ్రాండ్‌ రియల్‌ మి సరికొత్త, అత్యాధునిక ఉత్పాదనలను పరిచయం చేసినట్లు రియల్‌ మి ఇండియా సీఈఓ, వీపీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌షేత్‌ తెలిపారు. రియల్‌ మి జీటీ2 ప్రో, దాని అత్యంత ప్రీమియం ప్లాగ్‌షిప్‌ రియల్‌ మి9, 108ఎంపీ ప్రోలైట్‌ కెమెరా పవర్‌ పెర్ఫార్మర్‌ అన్నారు. దాని టెక్‌లైఫ్‌ ఎకోసిస్టమ్‌ ఆఫర్ల కింద కొత్త ఆకర్షణీయమైన ఉత్పత్తులను కూడా ఆవిష్కరించిందన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శాంసంగ్‌ ఐసోసెల్‌ హెచ్‌ఎం 6 ఇమేజ్‌ సెన్సార్‌తో పాటు అధునాతన సాంకేతిక ఫీచర్లను కలిగి ఉన్న మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్లలో ఇది ఒకటన్నారు. తమ 1ప్లస్‌ 5 ప్లస్‌ టీ వ్యూహంలో భాగంగా రియల్‌ మి బడ్స్‌ ఎయిర్‌ 3, రియల్‌ మి బుక్‌ ప్రైమ్‌, రియల్‌ మి స్మార్ట్‌ టీవీ స్టిక్‌ల ప్రారంభంతో తమ టెక్‌లైప్‌ ఎకోసిస్టమ్‌ ఆఫర్లను విస్తరింపజేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement