Thursday, May 2, 2024

బస్సులో ఫుట్‌బోర్డు మీద ప్రయాణించిన సమంత, నయనతార

ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హీరోయిన్లు సమంత, నయనతార బ‌స్సు ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్ర‌యాణించారు‌. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. వారి ప‌క్క‌నే విజ‌య్ సేతుప‌తి కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం వీరు ముగ్గురు తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ లో న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు విగ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవ‌ల చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ‌స్సులో స‌మంత‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఫుట్‌బోర్డ్‌పై నిలబ‌డి ప్ర‌యాణిస్తూ వారు మాట్లాడుకుంటారు. ఇందులో హీరోయిన్లు ఇద్ద‌రూ తెల్ల చీర‌లు ధ‌రించి క‌న‌ప‌డ్డారు. బ‌స్సు మొత్తం ప్ర‌యాణికుల‌తో నిండిపోయి ఉండ‌డంతో వారు ముగ్గురూ ఇలా ఫుట్‌బోర్డుపై ప్ర‌యాణిస్తున్న‌ట్లు సన్నివేశాన్ని షూట్ చేశారు.

https://twitter.com/seldicap17/status/1429684996176896001

ఈ వార్త కూడా చదవండి: అభిమానులకు శుభవార్త చెప్పిన హీరో కార్తీకేయ

Advertisement

తాజా వార్తలు

Advertisement