Saturday, May 4, 2024

అభిమానులకు శుభవార్త చెప్పిన హీరో కార్తీకేయ

హీరో కార్తీకేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడి నిశ్చితార్థం లోహితా రెడ్డితో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో కార్తికేయ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంపై హీరో కార్తీకేయ స్పందించాడు.

‘నా బెస్ట్ ఫ్రెండుతోనే నిశ్చితార్థం జరిగిందని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సన్నిహితురాలే ఇప్పుడు నా జీవిత భాగస్వామి కాబోతోంది. 2010లో లోహితను వరంగల్ ఎన్ఐటీలో కలిశాను. మరెన్నో దశాబ్దాల పాటు మా అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకోంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తాను విద్యార్థిగా ఉన్న సమయంలో లోహితతో కలిసి తీయించుకున్న ఫొటోను కూడా కార్తీకేయ షేర్ చేశాడు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement