Wednesday, May 1, 2024

ఏపీలో అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు

రాష్ట్రంలో అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్‌లు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి జగన్​కు అధికారులు వివరించారు. ఫేజ్‌-1లో 85,888 టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేశామని సీఎంకు వివరించారు. డిసెంబర్‌ నాటికల్లా లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామన్నారు.

పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు.. వివిధ రకాలుగా భూముల గుర్తింపు, సమీకరణ చేస్తున్నామని తెలిపారు.  విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రికి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రికి దాదాపుగా రూ.32 వేలు ఆదా అయ్యిందని అధికారులు వివరించారు. లబ్దిదారుల కోరిక మేరకు వారికీ నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన అధికారులు దీనికోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః రాజధాని కేసులపై విచారణ మళ్లీ వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement