Sunday, May 5, 2024

సాయిబాబాకి మొక్కుతూ.. గుడిలోనే క‌న్నుమూసిన భ‌క్తుడు

సాయిబాబా గుడిలోనే క‌న్నుమూశాడు ఓ భ‌క్తుడు. ఈ సంఘ‌ట‌న అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.మధ్యప్రదేశ్ కట్నీలోని పహరువా మండి రోడ్డులో చోటుచేసుకుంది. భక్తుడు నమస్కారం చేస్తూ అలాగే కుప్పకూలిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికంగా మెడికల్ దుకాణం నిర్వహిస్తోన్న రాకేశ్ మెహానీ అనే వ్యక్తికి సాయినాథుడంటే చాలా భక్తి. మండి రోడ్డులో సాయిబాబా గుడికి వెళ్తుండేవాడు. అయితే ఆయ‌న ఎప్ప‌టిలాగే సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేశ్.. అక్కడ బాబా పాదాలకు మొక్కుతూ అలాగే ఉండిపోయాడు. అక్కడున్న భక్తులు.. ఆయన నమస్కారం చేస్తున్నాడేమో అని భావించారు. ఆయన తర్వాత వెళ్లినవాళ్లు నమస్కారం చేసి వచ్చేస్తున్నా రాకేశ్ మాత్రం కదలకుండా పావుగంట పాటు అలాగే ఉండిపోవడంతో అనుమానం వచ్చి చూసేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో ఆలయ పూజారికి విషయం తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాకేశ్ సైలెంట్ గుండెపోటుకు గురైనట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement