Monday, May 6, 2024

డిసెంబ‌ర్ 7న.. సాయిధ‌ర‌మ్ తేజ్ న్యూ మూవీ గ్లింప్స్

డిసెంబ‌ర్ 7న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తోన్న న్యూ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుడు కార్తిక్‌ దండు తెర‌కెక్కిస్తున్నాడు. ఇది మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లేతో అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక సుకుమార్‌ కథ అందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మేకర్స్‌ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా గ్లింప్స్‌ను డిసెంబర్‌ 7న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్‌ చేసిన ప్రీలుక్‌ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెంచాయి. ఈ చిత్రంలో బ్లాక్‌ మేజిక్‌ వంటి అంశాలను టచ్‌ చేసినట్లు టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement