Wednesday, May 15, 2024

మంత్రి సబితపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆగ్రహం

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తప్ప సీనియర్ నేతలందరూ రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన నేతలపై నిప్పులు చెరిగారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, శరం లేకుండా ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు, తమను కూడా మోసం చేశారని మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైనా మధుయాష్కీ మండిపడ్డారు. సుధీర్ రెడ్డి భాగోతాలు అందరికీ తెలుసని… కాంగ్రెస్ భిక్షతోనే ఆయన హుడా ఛైర్మన్ పదవిని పొందారని చెప్పారు. హుడా ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఆంధ్ర నేత లగడపాటి రాజగోపాల్ తో కలిసి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డిపై చెప్పులేస్తామని నోరు జారుతావా సుధీర్ రెడ్డీ?’ అంటూ మధుయాష్కీ మండిపడ్డారు. ‘నీ భాగోతం నాకు తెలియదా? నేను కూడా మలక్ పేట్ నుంచే వచ్చా’ అని అన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డిని అడిగితే నీ భాగోతం మొత్తం బయటపెడతారని చెప్పారు.

ఇది కూడా చదవండి: కరోనా కంటే మోదీ, కేసీఆర్ ప్రమాదకరం: రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement