Friday, May 17, 2024

TS | 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు..

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక 6 నుంచి 8 తరగతుల పరీక్షలు ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో జరగనున్నాయి. ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement