పొరుగు దేశంఉక్రెయిన్పై అనాలోచిత యుద్ధం నేపథ్యంలో రష్యా ఒక దేశంగాకానీ, రక్షణపరంగా కానీ చాలా బలహీనపడిందని, తన దుష్టవైఖరితో మరింత ఒంటరి కాబోతోందని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బి అన్నారు. మంగళవారం జరిగిన నాటో కూటమిలోని సభ్య దేశాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఓ టీవీ ఇంటర్వ్యూలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో మరోసారి ఇరుగుపొరుగు దేశాలను ఆక్రమించుకోకుండా రష్యాకు బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. ఉక్రెయిన్పై ఆక్రమణ సందర్భంగా రష్యా వేలాదిమంది సైనికుల ప్రాణాలను , ఆయుధాలను కోల్పోయిందని, ఆర్థికంగా అతలాకుతలమవుతోందని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..