Monday, May 6, 2024

రమ్మీ నాలెడ్జ్ గేమ్.. ఆడితే తప్పేంటి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు శరత్ కుమార్

రమ్మీ నాలెడ్జ్ గేమ్ అని ఆడితే తప్పేంటని అన్నారు నటుడు శరత్ కుమార్. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీతో పాటు బెట్టింగ్ గేమ్ ను నిషేదిస్తూ..అక్కడి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకువచ్చింది. అయితే ఆ జీవో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండటంతో.. ఈ ఇష్యూ హాట్ హాట్ గా నడుస్తోంది తమిళనాట. ఈ విషయంలో శరత్ కుమార్ ను ప్రశ్నించింది తమిళ మీడియా. గతంలో శరత్ కుమార్ ఆన్ లైన్ రమ్మీకి బ్రాండ్ గా చేశారు.

ఈ యాడ్ లో ఆయన నటించారు. ఈ గేమ్ సంబంధించి అన్ని రకలుగా శరత్ కుమార్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈనేపథ్యంలోనే శరత్ కుమార్ ను ప్రశ్నించారు మీడియా ప్రతినిథులు. దానికి ఆయన సమాధానం చెపుతూ.. రమ్మీ ఒక నాలెడ్జ్ గేమ్. దాంట్లో తప్పేముంది అన్నారు. అంతే కాదు ప్రభుత్వం ఈ జీవో ఇవ్వడానికంటే ముందు.. అంటే రెండేళ్ల క్రితం తాను ఆఆడ్ లో నటించానన్నారు శరత్ కుమార్. ఈసందర్భంగా పలు విషయాలనై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను చెప్పినంత మాత్రాన అందరూ పేకాట ఆడేస్తారా.. ఇంత నిజాయితీగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేస్తుంటేనే జనాలు ఓట్లు వేయడంలేదు. మరి తాను ఆడమంటే రమ్మీ ఆడేస్తారా అంటూ.. డిఫరెంట్ గా మాట్లాడారు శరత్ కుమార్. అంతే కాదు రమ్మీ మేధో శక్తిని పెంచుతుంది అని ఆయన చేసిన వాఖ్యలు అక్కడ ప్రకంపణలు పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement