Thursday, May 9, 2024

Big Breaking | వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయిన ఆర్టీసీ బ‌స్సు.. ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌

ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు వెళ్తుండ‌గా బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. ఇవ్వాల (గురువారం) ములుగు స‌మీపంలోని గట్టమ్మ జాకారం మధ్యలో భారీ వరద తాకిడికి బస్సు కొంతదూరం కొట్టుకుపోయి పొలాల మధ్య లో నిలిచిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.

బస్సులో దాదాపు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. తమను రక్షించాలంటూ ప్రయాణీకులు కేకలు వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement