Wednesday, May 1, 2024

బైంసాలో ఆర్ఎస్ఎస్ కవాతు.. భారీగా పోలీసుల మోహరింపు..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చింది. దీంతో మధ్యాహ్నం 2:30 ని.లకు ఆర్ఎస్ఎస్ క‌వాతు ప్రారంభం కానున్న‌ది. పథ సంచలనం సుభద్ర వాటిక శిశుమందిర్ స్కూల్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా కొనసాగనున్నది. పథ సంచలనం భైంసాలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో 200 మందిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. ర్యాలీలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ ర్యాలీలో స్వయం సేవకులు పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement