బీఎస్పీ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమర్ తొలిరోజే టీఆర్ ఎస్ పార్టీని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దేశం సంపద కేవలం గుప్పెడు మంది చేతుల్లో ఉందన్న ఆయన…మన డబ్బును మనకే బిచ్చం వేసినట్టుగా పంచుతూ అదేదో మహోపకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. నల్లగొండలో జరిగిన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఇపుడెందుకు ఖర్చు చేస్తున్నారు? ఆయన పంచుతానన్న వెయ్యి కోట్లు ఎవరివి? కేసీఆర్కు దళితులపై అంత ప్రేముంటే.. ఆయన సొంత ఆస్తులను అమ్మి పంచాలి’’అని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇక సభకు వస్తున్న వారినుద్దేశించి మాట్లాడుతూ..ఇక్కడికి వస్తున్న సోదరులను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని.. అయినా మా బిడ్డలు ఆగరని ఆయన అన్నారు. సారో.. ఎక్కడున్నరు.. మాబిడ్డలు ఆగరు.. అంటూ కేసీఆర్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ”దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే వారికి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరు. అందరూ పాలకులే ఉంటారని చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికల వివాదం.. హేమ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నరేష్