Saturday, May 4, 2024

వైఎస్ షర్మిల కొత్త నినాదం.. జల్, జమీన్, జంగల్

తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ అనే కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కొత్త నినాదాన్ని ఇచ్చారు. పోడు పట్టాల కోసం పోరాడుతున్న అడవితల్లి బిడ్డలు ఆదివాసీలకు అండగా ఉంటానని వైఎస్ షర్మిల సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు అడవి తల్లి బిడ్డలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జల్, జమీన్, జంగల్ అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కొట్లాడిన కొమురంభీం వారసులుగా ఆ పోరాట తత్వాన్ని కొనసాగించాలని కోరారు. అడవి తల్లి బిడ్డలకు రాజన్న బిడ్డగా మీ వెంటే ఉంటానని వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. కాగా అక్టోబర్ 18 నుంచి తెలంగాణలో వైఎస్ షర్మిల తన పాదయాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్ తరహాలో చేవెళ్ల నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement