Monday, April 29, 2024

ఆర్ఎస్ ప్రవీణ్ అగ్రహం.. ఇలాంటివి రిపీటైతే కేసీఆరే బాధ్యత వహించాలి..

సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తుండగా జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని, పాలకుల చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయ‌న‌ విమర్శించారు. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వంపై కచ్చితంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటివి మరోసారి రిపీటైతే ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు ప్రవీణ్ కుమార్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement