Friday, May 17, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి అవంతిక‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి అవంతిక మొక్క నాటారు. ఈ సందర్భంగా అవంతిక మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం వెంకీ కుడుముల, అనసూయ భరద్వాజ్, రాబిన్ ఉతప్పల‌కు అవంతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement