Thursday, April 25, 2024

అందరికీ కృతజ్ఞతలు – రిషబ్ ట్వీట్

ముంబై – డెహ్రాడూన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాస్పిటల్ నుంచి తొలి ట్విట్ చేశాడు. డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ రహదారిలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆక్కడి నుంచే ట్వీట్ చేశాడు ” నాకు వచ్చిన గుడ్ విషెస్‌కి, ఈ సపోర్ట్‌కి నేను ఎంతో కృతజ్ఞుడిని. నా సర్జరీ విజయవంతమైందని తెలియచేస్తున్నా. కోలుకోవడం మొదలెట్టా. ముందు వచ్చే ప్రతీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అన్ని విధాల అండగా నిలిచిన బీసీసీఐ, జై సా, ప్రభుత్వ అధికారులకు థ్యాంక్యూ… ‘ అంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్. కారు ప్రమాదం నుంచి కాపాడి హాస్పిటల్ లో చేర్చిన ఇద్దరు యువకులు, డాక్టర్ ఉన్న ఫోటోను ఈ ట్వీట్ కి జత చేశాడు రిషబ్

కాగా.జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం…

Advertisement

తాజా వార్తలు

Advertisement