Sunday, April 28, 2024

రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయునికి వైఎస్ ఆర్ అచీవ్ మెంట్ అవార్డ్..స‌త్క‌రించిన ఎమ్మెల్యే..

తిరుపతి, ప్రభా న్యూస్ బ్యూరో : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం మొద‌టిసారిగా వైఎస్ ఆర్ అచీవ్ మెంట్ అవార్డుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ అవార్డుల‌ను 2021కి గాను ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. శ్రీ వేంకటేశ్వర నాదస్వర పాఠశాల, తిరుపతి ప్రధానోపాధ్యాయులుగా రిటైర్డ్ అయిన వి. సత్యనారాయణకి ఈ అవార్డును ప్రదానం చేశారు.నాదస్వరంలో మీరు కారణజన్ములు అయినందునే ఈ అవార్డు మిమ్మ‌ల్ని వ‌రించింద‌ని తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. అవార్డు గ్ర‌హీత ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేర‌కు ఆయ‌న్ని భూమ‌న స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మీరు ఎన్నో రాష్ట్రాల నుండి కళామతల్లి అవార్డులు అందుకున్నారు, మీ ప్రతిభను, మీ నాదయజ్ఞం చూసాను, కళామతల్లి బిడ్డలు, అందులోనూ టిటిడి నాదస్వర పాఠశాలలో పనిచేసిన మీకు ఈ అవార్డు రావడం సంతోషం అని అభినందించారు.. అనంత‌రం అవార్డు గ్రహీత కూడా శాసన సభ్యులను సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement